గోపీచంద్ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో ‘పంతం’ అంటూ జులై 05 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన డైరెక్టర్ కె.చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మొదటి రోజు మిక్సెడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం గోపీచంద్ గత చిత్రాలతో పోలిస్తే చాల బెటర్ గా వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రం రూ. 5. 2 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి రూ. 3. 22 కోట్ల షేరును రాబట్టి గోపిచంద్ కెరీర్ లోనే మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఈ వారాంతంలో మంచి వసూళ్లనే రాబట్టుకొనేలా వుంది. ఇక ఈరోజు విడుదలైన తేజ్ చిత్రానికి ప్లాప్ టాక్ వస్తుండడం తో రాబోయే రోజుల్లో పంతం కు కలెక్షన్స్ పెరుగుతాయని అంత మాట్లాడుకుంటున్నారు.