పవన్ కి పెళ్లి పిచ్చి.. జగన్ కి ఆ పిచ్చి !


జనసేనాని పవన్ కల్యాణ్, సీఎం జగన్ మధ్య విమర్శల పరంపర నడుస్తోంది. పవన్ పై జగన్ మూడు పెళ్లిళ్లు, నలుగురైదుగురు పిల్లలు అంటూ వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడగా, ‘జాగ్రత్తగా మాట్లాడండి’ అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలతో బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని తాజా పరిణామాలపై స్పందించారు. జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న మంచి పనులు పవన్‌ కళ్యాణ్‌కు కనిపించడం లేదని, కేవలం చంద్రబాబు చెప్పిందే వినిపిస్తోందని మంత్రి పేర్ని నాని విమర్శించారు.

పెళ్లిళ్లు, రాజకీయాలు, ప్రజాసేవ తదితర అంశాలను ఎవరైనా మనసుకు నచ్చినట్టు చేస్తారని అన్నారు. పవన్ కు పెళ్లిళ్ల మీద మక్కువ ఉంటే, సీఎం జగన్ కు ప్రజాసేవపై మక్కువ ఉందని తెలిపారు.సీఎం జగన్ ఎప్పుడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, వెంకయ్యనాయుడు గురించి గతంలో చేసిన విమర్శలను పవన్ గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.