ఖిలాడీ హీరో తో మరోసారి..

కెరియర్ మొదట్లో ఐరెన్ లెగ్ అనిపించుకున్న పూజా హగ్దే..ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా మారింది. డీజే చిత్రం తర్వాత అమ్మడు చేసిన సినిమాల్లా సూపర్ హిట్ అవుతుండడం తో పూజా కు వరుస ఛాన్సులు తలుపు తడుతున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురం లో చిత్రం లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ..తాజాగా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది.

అక్షయ్ కుమార్ నటిస్తున్న బచ్చన్ పాండీ చిత్రంలో ఛాన్స్ దక్కింది. ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ పాత్రలో ఈ అమ్మడు నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.