సినిమా సూపరే…కానీ కలెక్షన్లు వీక్‌!

కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ – ఆనంద్ దేవ‌ర‌కొండ‌లను హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్ నిర్మించిన సినిమా ‘దొర‌సాని’. పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు.

సినీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నా కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవన్న టాక్‌ వినిపిస్తోంది. దొరసానితో పాటు రిలీజ్‌ అయిన నిను వీడని నీడను నేనే ఇప్పటికే దాదాపు అన్ని చోట్లా బ్రేక్‌ ఈవెన్‌కు చేరువ కాగా దొరసాని కలెక్షన్ల వేటలో బాగా వెనుక పడిందన్న టాక్ వినిపిస్తోంది. వీకెండ్స్‌లోనే పెద్దగా ప్రభావం చూపించకపోవటంతో వీక్‌ డేస్‌లో పరిస్థితి మరి మరింత దారుణంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు.