ప్రభాస్ కు చిరాకు తెప్పిస్తున్నారట..

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎంతగా పెరిగిందో చెప్పాల్సిన పని లేదు..బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సైతం ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇక నార్త్ లో సైతం ప్రభాస్ కు వీరాభిమానులు ఎక్కువ అయ్యారు. కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ ప్రభాస్ అంటే పడి చచ్చే వారు పెరిగిపోయారు. ఈ క్రేజ్ తనను చాల ఇబ్బంది పెడుతుందని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రభాస్.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ.. తాను ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని ఏ ప్రముఖ నగరానికి వెళ్లినా కూడా సెల్ఫీలని మీద పడుతున్నారని చెప్పుకొచ్చాడు. తాను ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేక పోతున్నానని తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగుతుందని చెప్పుకొచ్చాడు. కొన్ని సార్లు ఇది బాగానే అనిపించినా ప్రతి సారి కూడా తనకు స్వేచ్చ లేకుండా పోవడంతో చిరాకుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.

అందుకే నేను బయటకు వెళ్లేందుకు మాస్క్ ను వాడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. బయటకు వెళ్లిన సమయంలో ధరించేందుకు నా వద్ద 50 బ్యాండనాస్ లు 60 క్యాప్ ల వరకు ఉన్నాయని, అవి లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. అవి ధరిస్తే తప్ప నేను బయట స్వేచ్చగా తిరుగలేక పోతున్నట్లుగా నవ్వుతూ తెలిపాడు.

ప్రస్తుతం ప్రభాస్ సుజిత్ డైరెక్షన్లో సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు.