ప్రభాస్ మల్టీస్టారర్ చిత్రం..మరో హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సాహో చిత్రంతో పాటు రాధాకృష్ణ డైరెక్టర్ లో మరో సినిమా చేస్తున్న ప్రభాస్…త్వరలోనే మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ స్వయం గా మరో హీరోయిన్ తెలుపడం విశేషం. వర్షం సినిమాలో విలన్ గా నటించిన గోపీచంద్ అందరికి సుపరిచితుడే. ప్రభాస్ – త్రిష కలయికలో వచ్చిన ఈ మూవీ లో ఓ పవర్ ఫుల్ విలన్ గా గోపీచంద్ కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత గోపి హీరో గా మారి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రభాస్ స్టార్ హీరో అయిపోయాడు.

వర్షం తర్వాత గోపీచంద్ – ప్రభాస్ కలయికలో మరే సినిమాలోనూ కలిసి నటించలేదు. వీరిద్దరూ తెరపై కలిసి కనిపించకపోయినా.. ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం మంచి స్నేహితులు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గోపీచంద్.. తమ ఇద్దరి కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా చూడబోతారని ప్రకటించారు. ఈ మల్టీస్టారర్ చిత్రానికి మంచి స్క్రీప్ట్ కోసం ఎదురు చూస్తున్నామని అది దొరికిన వెంటనే సినిమా మొదలు పెడతామని తెలియజేసాడు. ఈ మాటలు విన్న ఇరు హీరోల అభిమానులు ఆ స్క్రిప్ట్ త్వరగా దొరికితే బాగుండు అని మాట్లాడుకుంటున్నారు.

ఇటీవల గోపీచంద్ సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదు చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఢమాల్ అంటుంది. ఈ నేపథ్యంలో తనకు లౌక్యం , లక్ష్యం వంటి హిట్ చిత్రాలను అందించిన శ్రీవాస్ ను నమ్ముకున్నాడు. ఆయనతో త్వరలోనే ఓ సినిమా మొదలుపెట్టనున్నాడు.