నాగ్ అశ్విన్ – ప్రభాస్ మూవీ అంత ఆలస్యం కాదట..

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కలయికలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా..బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు లెజెండరీ దర్శకుడు సంగీతం శ్రీనివాస్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు.

ఈ సినిమా భారతీయ భాషలతో పాటు మరికొన్న విదేశాల భాషల్లోనూ రూపొందనుంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి మరింత ఆలస్యం అవుతుందనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అభిమానుల్లో అనేక సందేహాలు మొదలు అయ్యాయి. అయితే వీటి ఫై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

నాగ్ అశ్విన్ సినిమా ఆదిపురుష్ పూర్తయ్యేవరకూ ఆగదని వచ్చే ఏడాది వేసవి కాలం చివరకు మొదలవుతుందని చెప్పుకొచ్చాయి. ఈ సినిమాకు స్క్రిప్ట్ దాదాపు పూర్తయింది. నటీనటులు కూడా ఎంపిక చేయబడ్డారు. ఆదిపురుష్‌లో విజువల్ ఎఫెక్ట్‌లు చాలా ఎక్కవగా ఉంటాయి కాబట్టి సినిమా షూటింగ్‌ను చాలా త్వారగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఆదిపురుష్ ఆరునెల్లల్లో పూర్తవుతుంది. వెంటనే నాగ్ అశ్విన్ సినిమా కూడా మొదలవుతుంది. ఆదిపురుష్‌తో ఎటువంటి సంబంధం లేకుండా నాగ్ తన సినిమాను మొదలు చేస్తాడు. అతడు కూడా తన సినిమాను 2022లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడని తెలిపాయి.