యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ ఫై రాధే శ్యామ్ చిత్రం ఉండగానే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ మూవీ, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ తో ఆదిపురుష్ చిత్రాన్ని ప్రకటించాడు. అయితే ఈ రెండే కాక కిజిఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు.
దీనికి సంబందించిన అధికారిక ప్రకటనను విడుదల చేసారు. వీరిద్దరి కలయికలో తెరకెక్కబోయే చిత్రానికి ‘సలార్’ అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ (కేజీఎఫ్ మూవీ ప్రొడ్యూసర్) నిర్మించనున్నారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది జవవరిలో సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.