డిసెంబర్ లో పవన్ తో ప్లాన్ చేస్తున్న క్రిష్..

విభిన్న కథలతో ఎప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం అందించే డైరెక్టర్ క్రిష్…పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ 27 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరిగింది. ఔరంగజేబు కాలంనాటి కథతో క్రిష్ ఈ మూవీ చేస్తున్నాడు.

ఈ మూవీ కి చాలా గ్యాప్ రావడం తో ఈ లోపు క్రిష్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఒక ప్రాజెక్ట్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నవంబర్ కల్లా ముగించేసి ఓఅవాన్ తో డిసెంబర్ లో మొదలు పెట్టాలని యోచనలో ఉన్నట్టు టాక్. ఇప్పటికే పలు ఆసక్తికర టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.