చివరకు రాజ్ తరుణ్..శ్రీనివాస్ రెడ్డి స్థానానికి వచ్చాడు..

కమెడియన్లు హీరోలు అవుతుంటే హీరోలు కమెడియన్లు అవ్వకూడదా అనుకున్నాడో ఏమో కానీ రాజ్ తరుణ్ తాజాగా కమెడియన్ అవతారం ఎత్తబోతున్నాడు. గత కొంత కాలంగా రాజ్ తరుణ్ వరుస ప్లాపులతో తన మార్కెట్ ను పూర్తిగా పోగొట్టుకున్నాడు. ఈ తరుణం లో దిల్ రాజు బ్యానర్ లో లవర్ గా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఫై రాజ్ తరుణ్ గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. గతం లో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం తెగ కష్టపడ్డాడు. మరి ఈ మూవీ తర్వాత రాజ్ తరుణ్ ఏ సినిమా చేస్తున్నాడు…ఎవరి డైరెక్షన్లో చేయబోతున్నాడనే ఆసక్తి కొందిమందిలో ఉంది.. అయితే వారి ఆసక్తి తెరపడినట్లు తెలుస్తుంది.

తాజాగా రాజ్‌త‌రుణ్ డెబ్యూ ద‌ర్శ‌కుడు లంక‌ప‌ల్లి శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు నిర్మించే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈసారి రెగ్యుల‌ర్‌గా కాకుండా రాజ్ త‌రుణ్‌ కొత్త‌గా ట్రై చేస్తున్నాడట. కామెడీ హీరోని దృష్టిలో ఉంచుకుని అల్లుకున్న క‌థాంశ‌మిద‌ని చెబుతున్నారు. తొలుత ఈ చిత్రానికి శ్రీ‌నివాస్‌రెడ్డి హీరో అనుకుంటే అత‌డు అనూహ్యంగా ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు రాజ్ త‌రుణ్‌ని సంప్ర‌దించారని తెలుస్తోంది. కాస్త కొత్తగా ఉండడం తో ఈ సినిమాలో నటించేందుకు రాజ్ ఓకే చెప్పాడట. మరి సినిమాలేవీ లేవని ఓకే చేశాడా..నిజంగానే కొత్తగా ఉందని ఓకే చెప్పాడో ఆయనకే తెలియాలి.