హిమ‌వ‌ద్ గోపాల‌స్వామి టెంపుల్ ను దర్శించుకున్న జక్కన్న..

టాలీవుడ్ అగ్ర దర్శకుడు జక్కన్న తన సతీమణి తో కలిసి క‌ర్ణాట‌క ఛామ‌రాజ‌న‌ర‌గ్ జిల్లాలోని ప్రాచీన‌ హిమ‌వ‌ద్ గోపాల‌స్వామి టెంపుల్ ను సంద‌ర్శించారు. ఆల‌యంలో దంప‌తులిద్ద‌రూ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా దిగిన ఫొటో ఒక‌టి ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

రీసెంట్ గా జక్కన్న ఫ్యామిలీ కరోనా నుండి బయటపడిన సంగతి తెలిసిందే. రాజమౌళి తో పాటు కీరవాణి ఫ్యామిలీ సైతం కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత అంత ఇంట్లో ఉండి కరోనా ను జయించారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఫై ఫోకస్ పెట్టారు. షూటింగ్ లకు సైతం అనుమతులు రావడం తో అతి తక్కువ సభ్యులతో షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.