భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాలు ఆరంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్,.. అతిథులుగా హాజరయ్యారు.
ఈ చిత్రోత్సవంలో రజనీని ‘ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇఫి’ అవార్డుతో సత్కరించారు. తలైవాకు బిగ్బి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బిగ్బి మాట్లాడుతూ.. ‘ . రజనీకాంత్ను నా కుటుంబంలో సభ్యుడిలా భావిస్తాను. మేమిద్దరం ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటుంటాం. కొన్నిసార్లు సలహాలు ఫాలో అవ్వం. ఓ బంధం అంటే ఇలానే ఉంటుంది. రజనీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని అన్నారు.