రజనీ మేనియా మాములుగా లేదు..

సూపర్‌స్టార్ రజనీకాంత్ – గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మించిన భారీ చిత్రం ‘2.0’. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ఈరోజు ( నవంబర్ 29న ) ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యింది. వారం నుండి సోషల్ మీడియాలో రజనీ మేనియా మొదలు అయ్యింది. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న సినీ జనాలు విడుదల సమయం దగ్గర పడడంతో తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తూ వచ్చారు.

అర్ధరాత్రి నుండే భారీ ఎత్తున సినీ అభిమానులు, రజనీకాంత్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్స్ కు చేరుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమిళ, తెలుగు రాష్ట్రాలే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా రజినీ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. డ్యాన్సులు, డప్పులు మోతతో హంగామా చేస్తున్నారు. బాణాసంచాల కాలుస్తూ.. తలైవాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక యుఎస్‌లో పలుచోట్ల ఈ చిత్రం ఇప్పటికే ప్రదర్శితం కావడంతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమాని చూసిన రజినీ అభిమానులు, మూవీ అనలిస్ట్‌లు భారతీయ సినిమా హిస్టరీలో ఇదో విజువల్ వండర్ మూవీ అంటూ ప్రశంసిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. మొత్తం మీద ఎన్నో అంచనాల మధ్య వచ్చిన చిట్టి ..ఆ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు.