చరణ్ లాంటి కొడుకులేడే..అని బాధపడ్డాడట ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..మెగా వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈయన..మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించాడు. ఆ తర్వాత మగధీర తో ఇండస్ట్రీ రికార్డ్స్ నే బ్రేక్ చేసాడు. ఆ తర్వాత హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా అగ్ర హీరో రేంజ్ కి ఎదిగాడు. తాజాగా యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ తన సినిమా ప్రమోషన్లలో చరణ్ లాంటి కొడుకే లేడే అని బాధపడిన విషయాన్నీ తెలిపాడు.తాజాగా రాజశేఖర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో క‌ల్కి సినిమా చేసాడు.

ఈ చిత్ర ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలోనే హీరో రామ్ చ‌ర‌ణ్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసాడు. త‌న‌కు ఇద్ద‌రు కూతుళ్ళున్నా కూడా ఎప్పుడూ కొడుకు లేడ‌నే బాధ క‌నిపించ‌లేదు.. కానీ కొన్నిసార్లు రామ్ చ‌ర‌ణ్‌ను చూసిన‌పుడు మాత్రం అనిపిస్తుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ఈయ‌న‌. ఎందుకంటే చిరంజీవి ఇండ‌స్ట్రీకి దూర‌మై ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఖైదీ నెం 150 సినిమా చేసిన‌పుడు త‌నే నిర్మించి.. తండ్రి సినిమాకు సూప‌ర్ ప్ర‌మోష‌న్ చేసి పెట్టాడు. ఆ సినిమా తిరిగి రికార్డులు క్రియేట్ చేయ‌డానికి చ‌ర‌ణ్ కార‌ణం.. ఆయ‌న స‌మ‌ర్థ‌త అది అంటూ పొగిడాడు రాజ‌శేఖ‌ర్. అలాంటి స‌మ‌యంలో త‌న‌కు కూడా అలాంటి కొడుకు లేకపోయాడే అని కొన్నిసార్లు బాధ పడినట్లు తెలిపాడు. అయినా కూడా త‌న కూతుళ్లు క‌ల్కి సినిమాను స‌వాల్‌లా తీసుకుని నిర్మించార‌ని.. ఇప్పుడు దాన్ని ప్ర‌మోట్ చేస్తున్నార‌ని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.