రంభ శ్రీమంతం అదరహో


టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రంభ 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్ ను వివాహం చేసుకుంది. ఐతే ఆ మధ్య మనస్పర్థలు వచ్చాయి. రంభ, ఆమె భర్త మధ్య గొడవలు 2016లో తన భర్త నుంచి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. అయితే కొంత కాలంగా ఈ కేసుపై సుదీర్ఘ చర్చ జరిపిన కోర్టు ఇద్దరూ కలిసి ఒక అవగాహనకు రావాల్సిందిగా కోరింది. ఆ తర్వాత మళ్లీ వారిద్దరూ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమైంది.

తాజాగా అభిమానులందరికీ ఓ శుభవార్తను అందించింది రంభ. భ‌ర్తతో క‌లిసి ఆనందంగా జీవితాన్ని గడిపేస్తున్న రంభ త్వరలో మరో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇప్పటికే లాన్య(7), శాషా(3) అనే ఇద్ద‌రు కూతుళ్లకు జన్మనిచ్చిన రంభ ఫ్యామిలీలో.. త్వ‌ర‌లో వారింట మ‌రో బేబి అడుగుపెట్ట‌నుంది. తాజాగా ఆమె శ్రీమంతం కుటుంబీకులు, అలనాటి స్నేహితురాళ్ల మధ్య ఘ‌నంగా జ‌రుపుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా తన భర్త, బంధువుల‌తో క‌లిసి స్టెప్పులేసి రచ్చరచ్చజేసింది రంభ.