ప్రణయ్ హత్యపై చరణ్ దిగ్భ్రాంతి

కుమార్తె అమృతను పెళ్లి చేసుకున్న ప్రణయ్ ను వేరే కులం వాడన్న కారణంగా మామ మారుతీరావు కిరాతకంగా హత్య చేయించడంపై సినీ స్టార్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు రామ్, మనోజ్, సింగర్ చిన్మయి మిర్యాల గూడ పరువు హత్యని ఖండించారు. ఇలాంటి రోజుల్లో కూడా ఈ ఘటనలేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా, ఈ హత్యపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్పందించాడు. ప్రణయ్ హత్య తనను కలచి వేసింది. ఇలాంటి హత్యలపై అసహ్యమేస్తోంది. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపడం పరువుహత్య అవుతుందా ? అని ప్రశ్నించాడు. ఈ సమాజం ఎటు వెళ్తోంది. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించాడు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశాడు చరణ్.