‘యన్.టి.ఆర్’ మూవీ సెట్ లో అనుకోని అతిధి..

నందమూరి బాలకృష్ణ -క్రిష్ కాంబినేషన్ లో నందమూరి తారక రామారావు జీవిత కథతో ‘యన్.టి.ఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందటే ఈ చిత్ర షూటింగ్ రామకృష్ణ స్టూడియో లో మొదలు అయ్యింది. ప్రస్తుతం రామోజీ పిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా షూటింగ్ స్పాట్ కు అనుకోని అతిథి వచ్చి అందరి ఆశ్చర్యానికి గురిచేసారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా…రామోజీ ఫిలిం సిటీ అధినేత.. ఈనాడు మీడియా మొఘల్ రామోజీ రావు. అవును రామోజీరావు సెట్ కు వచ్చి దాదాపు అరగంట పాటు అక్కడే ఉండి సినిిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారట.

ప్రస్తుతం ఫిలిం సర్కిల్ వార్తల మేరకు ఈ మూవీ లో రామోజీ పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. క్రిష్ ఈ సందర్భంగా సినిమాలో ఆయన పాత్ర గురించి కూడా వివరించినట్లు చెబుతున్నారు. రామోజీ కూడా క్రిష్ కు కొన్ని సలహాలు ఇచ్చారట. రాజకీయంగా ఎన్టీఆర్ ఎదుగుదలలో రామోజీ రావుది కూడా కీలక పాత్ర అని అందరికి తెల్సిందే. అందుకే ఈ మూవీ లో రామోజీ రావు ను చూపించాలని క్రిష్ , బాలకృష్ణ లు అనుకున్నారట. ఇదే విషయం రామోజీ రావు తో మాట్లాడడం , దానికి ఒకే చెప్పడం జరిగిందని తెలుస్తుంది.

ఇక ఈ మూవీ లో విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్, సీనియర్ నరేష్, ప్రకాష్ రాజ్ వంటి నటి నటులు నటిస్తున్నారు. తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేసిన జనవరి 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.