రంగ్ దే నిర్మాతలకు భలే దెబ్బ పడిందే..

భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్..ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న సినిమాల ఫై ఫుల్ ఫోకస్ పెట్టాడు. వాటిల్లో రంగ్ దే చిత్రం ఒకటి. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘గిమ్మీ సమ్ లవ్’ అనేది ట్యాగ్ లైన్.

నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా..ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను దక్కించుకునేందుకు ప్రముఖి జీ తెలుగు పోటీపడింది. కేవలం శాటిలైట్ , డిజిటల్ కు కలిపి పది కోట్ల వరకు ఆఫర్ ఇచ్చారు. అయితే 12 కోట్లు కావాలంటే నిర్మాత నాగవంశీ పట్టుపట్టారు. 11 కోట్ల దగ్గర బేరం తెగేలా అనుకున్న టైమ్ లో కరోనా వచ్చి బ్రేక్ ఇచ్చింది. దాంతో రంగ్ దే శాటిలైట్ డీల్ ఆగిపోయింది. ఈ కరోనా వ్యవహారం ముగిశాక మాట్లాడదామని నిర్మాతలు చెప్పారట.