రష్మిక కి పొగరు పెరిగిందా ?


టాలీవుడ్ చిత్రసీమలో రష్మిక మందన్నకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఛలో అంటూ తెలుగు సినిమా గడప తొక్కిన ఈమె గీతగోవిందం సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. దీంతో రష్మికకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఈ అమ్మాయి కేర్ లెస్ గా వ్యవహరిస్తోందనీ, పారితోషికం కూడా బాగా పెంచేసిందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది కూడా.

అయినా ఇప్పుడు మళ్లీ అదే రూమర్ షికారు చేస్తోంది. ఇటీవల చైతూ జోడీగా చేయమని అడిగితే, ఆయనకంటే పారితోషికం ఎక్కువగా అడిగిందనే ప్రచారం జోరందుకుంది. కాగా నాగ చైతన్య, దిల్ రాజు కాంబోలో రూపొందనున్న ఈ సినిమాకు ‘అదే నువ్వు అదే నేను’ టైటిల్ పెట్టారని తెలిసింది. కొత్త దర్శకుడు శశి దర్శకత్వం వహించనున్నాడు.