మాస్ మహారాజ్ రవితేజ మరోసారి ఆ హాట్ బ్యూటీ ని ‘టచ్ చేసి చూస్తా’ అంటున్నాడు. గత కొంతకాలం గా హిట్ లేని రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్లో ఓ మూవీ , నేను లోకల్ ఫేమ్ నక్కిన త్రినాధ్ డైరెక్షన్లో ఓ మూవీ ప్రకటించారు.
రమేష్ వర్మ సినిమా విషయానికి వస్తే ..ఈ మూవీ లో ఢిల్లీ బ్యూటీ సీరత్కపూర్ ను ఎంపిక చేశారట. రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది సీరత్కపూర్. తొలి అడుగులోనే చక్కటి విజయాన్ని అందుకున్న ఆమెకు ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసిరాలేదు. టాలీవుడ్లో సరైన కమర్షియల్ సక్సెస్ కోసం నిరీక్షిస్తున్న ఈ ఢిల్లీ భామ ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలైన ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ చిత్రంలో ఆధునిక భావాలున్న అమ్మాయిగా చక్కటి నటనను ప్రదర్శించింది. ఇక ఇప్పుడు మరోసారి రవితేజ కు జోడి కట్టబోతుంది. గతంలో వీరిద్దరూ కలిసి ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నటించారు.