సీనియర్ నటి సెక్యూరిటీ గార్డ్‌కి కరోనా..

కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు..కేంద్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మహమ్మారి పంజా మాత్రం తగ్గడంలేదు. పేద , ధనిక , సినీ , రాజకీయ , క్రీడా ఇలా ఏ బేధం లేకుండా అందర్నీ భయపెడుతుంది. ఇక బాలీవుడ్ లోనూ కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే బిగ్ బి అమితాబ్, అయన కుమారుడు అభిషేక్ కరోనా బారిన పడగా…తాజాగా సీనియర్ నటి రేఖ సెక్యూరిటీ గార్డ్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో ముంబైలోని ఆమె బంగ్లాని బీఎంసీ సీల్ చేసింది. భవనం వెలుపలు కంటైన్‌మెంట్ జోన్‌గా నోటీసు కూడా అంటిచారు. రేఖ కాపలాగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఎప్పుడూ ఉంటారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మిగతా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.