రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్. రామ్చరణ్, ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’లో కథానాయకుల పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్గా తారక్ కనిపించనున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటి ఆలియా భట్ను ఈ సినిమాలో కథానాయికగా తీసుకున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగణ్ కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
కాగా బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, సంజయ్ దత్ను ఈ చిత్రంలోని కీలక పాత్రలకు దర్శక, నిర్మాతలు సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నటిస్తామని వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.