మెగా ఫ్యాన్స్ షాక్ .. సగం థియేటర్ ఖాళీ

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగా యాక్షన్ ప్యాక్ ‘వినయ విధేయ రామ. ‘ ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్ధరాత్రి నుండే అన్ని థియేటర్స్ దగ్గర మెగా అభిమానుల సందడి మొదలు అయ్యింది. గత ఏడాది లో రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చరణ్..ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తుండడంతో సినిమాను చూసేందుకు పోటీ పడ్డారు.

మాములుగా చరణ్ సినిమా అంటే మొదటి మూడు రోజులు టికెట్స్ దొరకడం చాల కష్టం. అలాంటిది వినయ విధేయ రామ విషయంలో రివర్స్ అయ్యింది. ఉదయం ఆటలో సగం థియేటర్ ప్రేక్షకులు లేక ఖాళీగా ఉండడం మెగా అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. ఎందుకు ఇలా అని ఒకరికారు మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం సంక్రాంతి సెలవులు మొదలు అవ్వడమే అని తెలుస్తుంది. చాలామంది సొంత ఊర్లకు ప్రయాణం అయ్యారు..మరికొంతమంది ప్రయాణానికి ప్లాన్ చేసుకున్నారు. దీంతో సినిమా చూసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపించలేదని తెలుస్తుంది.

కానీ సోషల్ మీడియా లో మాత్రం వేరే హీరోల అభిమానులు చరణ్ సినిమాకు జనాలే లేరు అంటూ కామెంట్స్ వేస్తూ తెగ షేర్ చేస్తున్నారు.