‘సాహో’ రిలీజ్ వాయిదా…!

సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా రెబెల్ స్టార్ ప్రభాస్ మూవీ ‘సాహో’ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. బాహుబలి’ 1, 2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్, విక్కీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ర‌న్‌ రాజా రన్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగ‌స్ట్ 15న రానుంద‌ని ఇప్ప‌టికే ప్రకటించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే తాజాగా వినిపిస్తున్న ప్ర‌చారం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ ఆగస్టు చివరి వారంకు వాయిదా పడినట్లు తెలుస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30న విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. దీంతో ఇప్పటి వరకు ‘సాహో’ విడుదలను దృష్టిలో పెట్టుకుని వాయిదా పడిన చిత్రాలన్నీ ఈ ఆగస్ట్ 15కు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ ‘రణరంగం’, అడవి శేష్ ‘ఎవరు’ చిత్రాలు ఆగస్ట్ 15న విడుదల అవుతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు.