మన్మధుడు 2 కీర్తి , సామ్ పాత్రలు అవేనట..

కింగ్ నాగార్జున – రకుల్ ప్రీతీ సింగ్ జంటగా ప్రముఖ నటుడు, చి.ల.సౌ చిత్రంతో డెబ్యూలోనే తొలి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ దఃర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన్మధుడు 2. ‘మన్మథుడు’ చిత్రానికి 17 ఏళ్ల తరువాత సీక్వెల్ వస్తున్న సినిమా కావడం తో దీని ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను తెరకెక్కిస్తున్నారు రవీంద్రన్.

ఇక ఈ చిత్రంలో కీర్తిసురేష్, సమంత కూడా గెస్ట్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆ పాత్రలు ఏమిటి..? అన్నదే ఆసక్తి కలిగిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో పెళ్లికోసం, అద్దె పెళ్లాం కోసం ట్రయ్ చేస్తూ హీరో పలువురిని కలుస్తాడు. ఇప్పుడు అలా కలిసేవాళ్ల పాత్రలనే కీర్తి సురేష్, సమంత అండ్ కో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిది కూడా జస్ట్ గెస్ట్ రోల్స్ మాత్రమే అని, సినిమాకు జస్ట్ మరింత బజ్ రావడం కోసం వాళ్లని తీసుకున్నారని టాక్. మరి వీరి పాత్రలు ఇంతేనా అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.