చైతు విషయంలో బాధ పడ్డ సమంత


నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో.. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ సెప్టెంబర్ 13న వినాయకచవితి పర్వదినాన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మంచి వసూళ్లే వచ్చాయి., ఐతే చాలా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. దీనిపై సమంత చాలా బాధపడింది. ఈ విషయాన్ని నాగార్జున చెప్పారు.

”భార్యా భ‌ర్త‌ల సినిమా ఒకే రోజు విడుద‌ల అవ్వ‌డం నేనెప్పుడూ చూడ‌లేదు. రెండూ బాగా ఆడాయి. అయితే ఆ రోజు ఉద‌యం శైల‌జారెడ్డి అల్లుడ రివ్యూలు చూసి స‌మంత బాధ ప‌డింది. మ‌రేం ఫ‌ర్వాలేదు వ‌సూళ్లు బాగుంటాయి అన్నాను. నేను అన్న‌ట్టే శైల‌జారెడ్డి కి మంచి వ‌సూళ్లు ద‌క్కాయి. యూ ట‌ర్న్ రివ్యూలు బాగున్నా వ‌సూళ్లు స‌రిగా లేవు. ఆదివారం నాటికి వ‌సూళ్లు పెరుగుతాయి అని చెప్పా. అన్న‌ట్టుగానే వ‌సూళ్లు పెరిగాయి” అని చెప్పారు నాగ్.