టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత..పెళ్లి తర్వాత ఎక్కువగా ప్రయోగాత్మక కథలనే ఎంచుకుంటుంది. ఓ బేబీ , జాను వంటి చిత్రాలు ఆ తరహాలోనివే. తాజాగా ఇప్పుడు ‘గేమ్ ఓవర్’ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ నిర్మించనుందని టాక్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారట. తన కెరీర్లోనే తొలిసారిగా సమంత దివ్యాంగురాలి(మాటలు రాని, చెవులు వినపడని) పాత్రలో నటించనుందట. ఇలాంటి పాత్రలో ఇప్పటికే అగ్ర కథానాయికలైన అనుష్క, నయనతార, తమన్నాలు నటించారు
. ‘నిశ్శబ్దం’లో అనుష్క, ‘వసంతకాలం’ చిత్రంలో నయనతార, ‘కామోషి’ చిత్రంలో తమన్నా ఇదే తరహా దివ్యాంగురాలి పాత్రలో మెప్పించే ప్రయత్నం చేశారు కానీ ఏ ఒక్కరికీ ఆశించిన సక్సెస్ రాలేదు. మరి ఇప్పుడు అదే పాత్రలో సమంత నటించబోతుంది. మరి వారికీ దక్కని సక్సెస్..ఈమె కు దక్కుతుందా అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.