మరో సినిమాకు సిద్దమైన మాస్ రాజా..


హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంథోని సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయి , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటె తాజాగా రవితేజ సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది. వాస్తవానికి సంతోష్ డైరెక్షన్లో తేరి సినిమా రీమేక్ చేయాల్సి ఉండే , కానీ కొన్ని సమస్యలు రావడం తో అది మధ్యలోనే ఆగిపోయింది.

దీంతో ఇప్పుడు ఆ స్టోరీని మళ్లీ మార్చేసారు. తెరి లైన్ మాత్రం తీసుకుని, మొత్తం సీన్లు కొత్తగా రాసుకున్నాడట. ఆ సన్నివేశాలు బాగుండడం తో రవితేజ మళ్లీ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. అన్ని కుదిరితే వచ్చేనెల ఆరంభంలో సినిమాకు క్లాప్ కొట్టవచ్చని అంటున్నారు.