అప్పుడే సరిలేరు అనిపించుకుంటున్న మహేష్

వరుస హిట్లతో మహేష్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు..ఒకదానిని మించి మరోటి బంపర్ హిట్ అవుతుండడం తో అభిమానుల సంబరాలు మాములుగా లేవు. రీసెంట్ గా మహర్షి తో హిట్ అందుకున్న మహేష్..ఇప్పుడు సరిలేరు నీకెవ్వరూ సినిమా చేయబోతున్నాడు. పటాస్ , సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 వంటి భారీ హిట్లు కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జులై 04 నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది.

మొదటి షెడ్యూల్ కాశ్మీర్ లో ప్లాన్ చేసారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టకముందే అప్పుడే సినిమా శాటిలైట్స్ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ జెమినీ వాళ్లు ఏకంగా 16.5 కోట్ల‌కు కొనుగోలు చేసినట్టు సమాచారం. దీనికి ముందు మ‌హ‌ర్షి సినిమాను 12 కోట్ల‌కు జెమినీ వారు దక్కించుకోగా..ఇప్పుడు అంత‌కంటే నాలుగు కోట్లు ఎక్కువ‌గానే స‌రిలేరు నీకెవ్వ‌రు రైట్స్ దక్కించుకోవడం విశేషం.

దిల్ రాజు, అనిల్ సుంక‌ర‌తో క‌లిసి మ‌హేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ర‌ష్మిక మంద‌న్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. విజ‌య‌శాంతి మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.