సర్కారు వారి పాట ఎంత వరకు వచ్చిందంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

ఈ చిత్రం తాలుకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతిమ దశలో ఉందని తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం మొట్ట మొదటి షెడ్యూల్ ను చిత్ర యూనిట్ యూఎస్ లో ప్లాన్ చేశారన్న సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ కు సంబంధించి తమ చిత్ర యూనిట్ కు వీసా ల కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి అవి వచ్చినట్టయితే ఆ తక్కువ మందితోనే అక్కడికి వెళ్లి షూట్ ను కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ మరియు మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.