సర్కారు వారి పాట శాటిలైట్ రైట్స్ ఏ ఛానెల్ దక్కించుకుందో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు.

ఈ చిత్రం తాలుకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతిమ దశలో ఉందని తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం మొట్ట మొదటి షెడ్యూల్ ను చిత్ర యూనిట్ యూఎస్ లో ప్లాన్ చేశారన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఛానల్ స్టార్ మా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న మహేష్..అలాగే గీత గోవిందం తో సూపర్ హిట్ కొట్టిన పరుశురాం..వీరిద్దరి కలయికలో సినిమా కావడం తో శాటిలైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడిందట. అయినాగానీ మా ఛానల్ వారు ఫ్యాన్సీ రేటుకే దక్కించుకున్నారట.