రాధే శ్యామ్ డైరెక్టర్ కు మాములు షాక్ ఇవ్వలేదుగా..

జిల్ ఫేమ్ రాధాకృష్ణ కు సోషల్ మీడియా లో షాక్ తగిలింది. ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో రాధే శ్యామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఫస్ట్ లుక్ విడుదల చేసి అంచనాలు రెట్టింపు చేసాడు. ఈ జోష్ లో ఉండగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ని బ్లాక్ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కన్‌ఫాం చేసాడు.

ఇక పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ని గోపి కృష్ణ మూవీస్ , యూవీ క్రియేషన్స్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎన్నాళ్లగానో ఊరిస్తున్న అప్డేట్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ మరియు రీట్వీట్స్ తో దుమ్మురేపాడు. దీనితో రాధే శ్యామ్ టైటిల్ 6.3 మిలియన్ ట్వీట్స్ దక్కించుకుంది. రోజంతా రాధే శ్యామ్ టైటిల్ ట్రెండింగ్ లో కొనసాగింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ లాక్ డౌన్ కారణంగా బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతి రావడం తో త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భారీ హాస్పటల్ సెట్ వేయబోతున్నారు.

ఈ చిత్రం షూటింగ్ యూరప్ లో ఎక్కువగా జరిగింది. ఇంకా కూడా అక్కడే చిత్రీకరణ జరపాల్సి ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి షూటింగ్స్ చేయలేని పరిస్థితి. కనుక హైదరాబాద్ లోనే ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ ను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితులను ఇక్కడ రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.హైదరాబాద్ లో ఈ చిత్రం కోసం 5 కోట్లతో భారీ హాస్పిటల్ సెట్ ను నిర్మిస్తున్నారట.