సర్కారు కోసం ప్రత్యేక సెట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లో ఓ ప్రత్యేకమైన సెట్ ను సిద్ధం చేస్తున్నారట.

ఈ చిత్ర షూటింగ్‌‌ను మొదటగా యూఎస్‌లో మొదలు పెట్టాలని ఆలోచించారు. కానీ కరోనా కేసుల పెరుగుదల కారణంగా యూఎస్ ప్లాన్‌ను కాన్సిల్ చేశారు. అయితే ఇంతలో హైదరాబాద్‌లో షూటింగ్‌ను మొదలు పెట్టాలను చిత్ర యూనిట్ ఆలోచించింది.