“బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, పరుగు, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, శతమానం భవతి“ లాంటి ఎన్నో సూపర్డూపర్ హిట్ కుటుంబ కథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దిల్ రాజు.. గత ఏడాది డబుల్ హ్యాట్రిక్తో సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసాడు. ఇప్పుడు `శ్రీనివాస కళ్యాణం` సినిమాతో జీవితంలో పెళ్లి విశిష్టతను తెలియజేప్పే ప్రయత్నం చేస్తున్నారు.
14 ఏళ్ల క్రితం హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘దిల్’ చిత్రం ఇద్దరికీ ఎంత ఉపయోగపడిందో..చెప్పాల్సిన పనిలేదు. అలాంటి కాంబో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు `శ్రీనివాస కళ్యాణం`తో రాబోతున్నారు.. గత ఏడాది జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన `శతమానం భవతి` చిత్రాన్ని రూపొందించిన డైరెక్టర్ సతీశ్ వేగేశ్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఆగష్టు 9 న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర కాన్సెప్ట్ టీజర్ ను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నారు. అలాగే, ఆడియో రిలీజ్ ఎప్పుడు అనే విషయాన్ని కూడా రేపు ఉదయం 9 గంటలకు ప్రకటిస్తారట దిల్ రాజు. ఇప్పటికే విడుదలైన శ్రీనివాస కళ్యాణం టైటిల్ సాంగ్ శ్రోతలను బాగా అలరిస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుంది.
నితిన్, రాశీఖన్నా, నందితా శ్వేత, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటింగ్: మధు, సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బండి రత్న కుమార్, సంగీతం: మిక్కి జె.మేయర్, నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, కధ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వేగేశ్న సతీష్.