పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా తెలుగులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు ఈ సినిమా తమిళ రీమేక్కు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమా దర్శకుడు హీరో ఫిక్స్ అయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు కథానాయకుడిగా సీనియర్ దర్శకుడు సుందర్.సి ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. వాస్తవానికి సుందర్ ‘సంఘమిత్ర’ను సెట్స్ మీదికి తీసుకెళ్లాల్సింది. ‘ ఆ చిత్రం అనివార్య కారణాలతో ఆగిపోయింది. దీంతో సుందర్ ‘అత్తారింటికి దారేది’ రీమేక్ పై ఫోకస్ పెట్టారు.