బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆత్మహత్య ఫై కేసు విచారణ జరుగుతుంది. అయితే అభిమానులు సుశాంత్ మైనపు బొమ్మను లండన్లోని మేడమ్ తుస్సాడ్స్లో ఏర్పాటు చేసేందుకు ఆన్లైన్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు ఈ పిటిషన్పై సంతకం చేశారు.
ఇక ఇది కార్యరూపం దాల్చేందుకు చాలా సమయమే పెట్టె అవకాశం ఉండడం తో ప్రముఖ మైనపు బొమ్మల తయారీ కళాకారుడు సుకంతో రాయ్ ఓ అడుగు ముందుకేసి సుశాంత్ మైనపు బొమ్మను తయారు చేశారు. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్కి చెందిన ఈ కళాకారుడు తన ఇంట్లో ఈ బొమ్మను తయారు చేశారు. ప్రస్తుతం ఈ మైనపు బొమ్మ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.