క్లైమాక్స్ లో సైరా..

మెగాస్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. కొణెదల ప్రొడక్షన్ బ్యానర్ ఫై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గత రెండు వారాలుగా ఈ చిత్ర షూటింగ్ జార్జియాలో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్ర క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కెమెరామెన్ రత్నవేలు భారీ ఏక్యూప్మెంట్స్ సాయంతో సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు సమాచారం.

వందల మంది యాక్షన్ టీమ్ ఈ షూట్లో పాల్గొంటున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్లు సైతం ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. చిరంజీవి తో పాటు అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ లు ఈ చిత్రీకరణలో ఉన్నారు. ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు.