ప్రభాస్‌ని అనుసరిస్తున్న మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘ఖైది నెం.150’తో తన స్టామీనా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్న చిరు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ‘సైరా’గా రాబోతున్నాడు. ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌ 2న ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు ‘సాహో’కు సంబంధించిన ట్రయిలర్‌ నేడు (సెప్టెంబర్‌ 18)న విడుదల కానుంది. సాయంత్రం ట్రయిలర్‌ని విడుదల చేయడానికి పలు థియేటర్లను బ్లాక్‌ చేసిన విషయం తెల్సిందే.

ట్రయిలర్‌ విడుదల కాగానే థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాల ట్రయిలర్‌లను కూడా థియేటర్లలో విడుదల చేసిన విషయం తెల్సిందే. దాంతో ఆ చిత్రాలకు మంచి పాపులారిటీ దక్కింది. దాంతో చిరు ‘సైరా’ని కూడా థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేశారు. మొత్తానికి ట్రయిలర్‌ విషయంలో చిరు ప్రభాస్‌ని అనుసరించాడు. ఈ చిత్రంలో అమితాబ్‌, నయన్‌, విజయ్‌ సేతుపతి, సుధీప్‌లు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.