‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ టాక్ తో బాలీవుడ్ షాక్..

అమీర్, అమితాబ్‌ , కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో `ధూమ్‌-3` ఫేమ్‌ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’. 1839 కాలం నాటి `కన్ఫెషన్స్ ఆఫ్ థగ్‌` నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ దీపావళి కానుకగా ఈరోజు (నవంబర్ 08) న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల అయ్యింది.

స్వాతంత్య్రానికి పూర్వం బందిపోట్లకు, బ్రిటిష్ సైనికులకు మధ్య జరిగే పోరాటమే ఈ ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’. సుమారు మూడొందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ చిత్రం ఫై యావత్ సినీ ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అమితాబ్ బందిపోటు దొంగగా నటించడం , సినిమా ట్రైలర్స్ , టీజర్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచడం తో అంత బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని అంచనాలు వేసుకున్నారు. కానీ సినిమా విడుదలయ్యాక కానీ అసలు సినిమా తెలియరాలేదు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు డిజాస్టర్ గా తెలుస్తున్నారు.

అమీర్ ఖాన్ స్థాయికి తగ్గట్లుగా ఈ చిత్రం లేదని.. సినిమాకంటే ట్రైలరే బావుందని ఒక్కమాటలో చెపుతున్నారు. అసలు సినిమాకు రూ. 300 కోట్లు ఖర్చు ఎందుకు ఖర్చు చేరారో అర్ధం కావడం లేదని , అమీర్‌ కామెడీ అస్సలు బాలేదని అంటున్నారు. మరోపక్క సినీ విశ్లేషకులు సైతం సినిమా కు 1 , 2 రేటింగ్ ఇవ్వడం అంత షాక్ అవుతున్నారు. ఈ టాక్ చూసి బాలీవుడ్ ప్రేక్షకులంతా షాక్ లో పడ్డారు.