టాలీవుడ్ నయా మల్టీస్టారర్ ట్రెండ్ : చిన్నోడు పెద్దోడు

ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున – ఇప్పుడు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్, అల్లుఅర్జున్ ఇది అంత ఎందుకు అనుకుంటున్నారా సీనియర్ ఎన్టీఆర్ మరియు నాగేశ్వరావు కలిసి ఆ తరంలో మల్టీ స్టారర్ మూవీస్ చేసారు .కానీ వాళ్ళ తరువాత తరంలో మల్టీ స్టారర్ మూవీస్ ఎవరు అంత చెప్పుకోతగ్గగా చేయలేదు .

గత కొంత కాలంగా ఇప్పడు ఉన్న యంగ్ హీరోల మూవీస్ లో మన సీనియర్ హీరోస్ గెస్ట్ రోల్ వంటివి చేస్తూ వస్తున్నారు. రామ్ చరణ్ మూవీ బ్రూస్ లీ మూవీ లో చిరు, మంచు మనోజ్ మూవీలో బాలయ్య, నాగచైతన్య మరియు రానాల మూవీలో వెంకటేష్, మంచు విష్ణు మూవీలో నాగ్ లు గెస్ట్ రోల్ చేసారు.

ఈ తరంలో ముందుగా వెంకటేష్ ,మహేష్ బాబు లు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మల్టీ స్టారర్ మూవీ ని చేసారు. తరువాత వెంకటేష్ -రామ్ ల మసాలా , సునీల్ – నాగ చైతన్యల తడాఖా వంటి మల్టీ స్టారర్ మూవీస్ వచ్చాయి . కానీ ఇప్పుడు ఏకంగా కుర్ర హీరోలతో సీనియర్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటూ మల్టీ స్టారర్ మూవీస్ ల ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పుడు ప్రస్తుతం షూటింగ్ స్టేజి లో ఉన్న మూవీలు:

* వెంకీ – వరుణ్ తేజ్ వీళ్లిద్దరు అనిల్ రావిపూడి డైరెక్షన్లో F2 అనే కామెడీ మూవీ చేయబోతున్నారు .
* వంశి పైడిపల్లి దర్శకత్వంలో నాగ్ ,నాని లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు .
* బాలయ్య నిర్మాణంలో క్రిష్ డైరెక్ట్ చేయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య తో పాటు రానా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు .

వీటితో పాటు తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ నలుదిక్కులకు బాహుబలి ద్వారా చాటిచెప్పిన దర్సక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుంది