తమ్ముడి తో చరణ్ సెల్ఫీ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పక్క సైరా నిర్మాణ పనులు చూసుకుంటూనే..మరోపక్క ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ బిజీగా గడుపుతన్నాడు. కాస్త టైం దొరికితే చాలు ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ దిగారు. ఈ ఫోటోను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో కు మెగా అభిమానులు ఫిదా అవుతూ..తెగ షేర్స్…కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో వాల్మీకి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాక్సర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ప్రొఫెషనల్ బాక్సర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. ఏప్రిల్ 16 వ తేదీ నుంచి ఈ చిత్రంలో వరుణ్ జాయిన్ కానున్నాడు. తమిళ్ సూపర్ హిట్ మూవీ జిగర్తండా తెలుగులో వాల్మీకి గా రీమేక్ గా తెరకెక్కుతుంది. 14 రీల్స్ ప్లస్ వారు నిర్మిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో బాబీ సింహ పోషించిన పాత్రలో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తుండగా , సిద్దార్థ్ పోషించిన రోల్ లో తమిళ యువ హీరో అథర్వ మురళి నటిస్తున్నాడు.