వెంకీ.. త్రివిక్రమ్.. డౌటే

త్రివిక్ర‌మ్ వెంక‌టేష్ సినిమాఫిక్స్ గతంలో. ఈ సినిమ ఎప్పుడు నుండో చర్చలో వుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేశారు. వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా హారిక హాసిని కాంబినేష‌న్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.త్రివిక్రమ్ రాసిన.. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి.. వెంకీ కెరీర్లో నిలిచిపోయి చిత్రాలు. ఇప్పుడు మళ్ళీ వీరు కలుస్తుండటంతో అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు.

అయితే లేటెస్ట్ టాక్ ఏమిటంటే.. ఈ సినిమా డౌట్ గా వుందని టాక్. `అర‌వింద స‌మేత‌`కి ముందే ఈ కాంబోలో సినిమా ఉంటుంద‌ని ఆశించారు. కానీ కుద‌ర్లేదు. `అర‌వింద స‌మేత‌` త‌ర‌వాతైనా ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు బ‌న్నీకి క‌మిట్ అయిపోయాడు త్రివిక్ర‌మ్‌. దాంతో వెంకీ – త్రివిక్ర‌మ్ కాంబో పై అనుమానాలు నెలకొన్నాయి.