హీరో విశాల్ నటి అనీశాను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని విశాల్, అనీశా సోషల్మీడియా వేదికగా ఇటీవల ప్రకటించారు. అయితే అనీశా ఎలా పరిచయం అయ్యారనే విషయాన్ని విశాల్ తాజాగా మీడియాతో పంచుకున్నారు. ‘అయోగ్య’ సినిమా షూటింగ్ కోసం వైజాగ్ వచ్చినప్పుడు ఆమె పరిచయం. అనీశా స్నేహితులతోపాటు తనను కలవడానికి వచ్చింది. అప్పుడే ‘మైఖెల్’ అనే సినిమాలో అనీశా కథానాయిక. ఇది వ్యవసాయం నేపథ్యంలో సాగే సినిమా అని, యూనిట్కు చెందిన వారు వ్యవసాయదారులని చెప్పడంతో చిత్రాన్ని విడుదల చేస్తానని చెప్పా. అలా కొన్నిసార్లు అనీశాను కలుసుకున్న తర్వాత ఆమెపై ప్రేమ పుట్టిందని, ప్రపోజ్ చేశా, తర్వాత ఆమె సమయం తీసుకుని ఒప్పుకుంది” అన్నాడు విశాల్.
అన్నట్టు అనీషా ఎవరో కాదు. హైదరాబాద్ బిజినెస్మేన్ విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె. అనీషాకి సినిమాల్లో నటించిన అనుభవం కూడా ఉంది. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో చిన్నపాత్రలు వేసింది. ఇక వీళ్ళ పెళ్లి వేదిక కూడా ఖారరైయింది. విశాల్ ముందు ప్రకటించినట్టుగానే చెన్నైలోని నడిగర్ సంఘం కొత్త బిల్డింగ్ లో విశాల్-అనీషాల పెళ్లి జరగబోతోంది.