హిట్..ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్న తమిళ్ హీరో విశాల్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో ఉన్నాడు. తమిళ హీరోలు విశాల్, ఆర్య ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తుండగా, ఆర్య విలన్ నటిస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్గానే హైదరాబాద్లో షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. షూటింగ్లో భాగంగా సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ను రామోజీ ఫిలింసిటీలో పూర్తి చేశారు. ఈ పాట కోసం మినీ ఇండియాను తలపించేలా ఓ భారీ సెట్ వేశారట. ఆ సెట్లోనే పాటను పూర్తి చేశామని విశాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. బృందగోపాల్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో టిక్ టాక్ స్టార్, గద్దలకొండ గణేష్
సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్గా నటిస్తుంది.