టీడీపీ కి మంచు విష్ణు సవాల్..

సినీ నటుడు మంచు విష్ణు టీడీపీ నేతలకు సవాల్ విసిరారు..శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏపీ సర్కార్ చెల్లించడం లేదంటూ మోహన్ బాబు..మంచు విష్ణు, మనోజ్ శుక్రవారం రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఫై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు..వైసీపీ పార్టీ కోసమే మోహన్ బాబు ఇలా చేస్తున్నాడని విమర్శలు చేయడం తో మంచు విష్ణు టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రావడం లేదని.. ప్రభుత్వం నుంచి మేము లేఖలో పేర్కొన్న దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా.. నా ఆస్తులన్నీ అమ్మేసీ మీ పార్టీ కు ఇస్తానని మంచు విష్ణు టీడీపీ నేతలకు ఓపెన్ చాలెంజ్ చేశాడు. మానాన్న గారు 25శాతం పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యూకేషన్ ఇస్తున్నారని..అది మీ డబ్బులతో కాదని .. నాన్న గారు నటుడిగా సంపాదించిన డబ్బులతోనే ఇవన్నీ నడిపిస్తున్నారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.