ఆ అరగంట అరుపులేనట..

మరో వారం లో ఓ పక్క సంక్రాంతి సంబరాలు..మరో పక్క సినీ సంబరాలు మొదలు కాబోతున్నాయి. ఈ సంక్రాంతి కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు బరిలో దిగబోతున్నాయి. ఈ మూడు కూడా దేనికి అదే అన్నట్లు రాబోతున్నాయి. ఒకటి ఎన్టీఆర్ బయోపిక్ ప్యాక్ , మరోటి రామ్ చరణ్ మెగా ప్యాక్ , మూడోది అల్లుళ్ల ఫన్ ప్యాక్ ఇలా మూడు మూడు రకాల జోనర్లతో రాబోతున్నాయి.

అయితే ప్రస్తుతం చరణ్ – బోయపాటి కలయికలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే చిత్ర ప్రొమోషన్లను ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్ ప్రోమోస్ , ట్రైలర్ , చిత్ర పిక్స్ ముఖ్యం గా చరణ్ స్టిల్స్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉంచుతున్నాయి. ఇదిలా ఉంటె తాజాగా సినిమాకు సంబందించిన మరో వార్త బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది.

సినిమాలోని కీలకమైన ఓ ఎపిసోడ్ లో చరణ్ అరిపిస్తాడట.. విశ్రాంతి తర్వాత అరగంట సేపు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ అరగంట బీహార్ బ్యాక్ డ్రాప్ అన్నమాట. అయితే దీన్ని అజర్ బైజాన్ లో చిత్రీకరించారు. ఈ అరగంట సినిమాలో బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ లు వుంటాయని, ఈ సీన్లలోనే రామ్ చరణ్ ఫుల్ బాడీ గెటప్ ల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ అరగంట థియేటర్స్ లలో అరుపులే అంటున్నారు చిత్ర యూనిట్.

సాధారణంగా బోయపాటి సినిమాలకు రామ్ లక్ష్మణ్ ఫైట్ల మాస్టర్లుగా అద్భుతమైన ఫైట్లు కంపోజ్ చేస్తుంటారు. వినయ విధేయకు మాత్రం కనల్ కన్నన్ పనిచేసారు. బోయపాటి-కనల్ కన్నన్ కాంబినేషన్ ఎలా వుంటుందో చూడాలి.

జనవరి 11 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత దానయ్య. ఈ మూవీ లో చరణ్ సరసన కైరా అద్వానీ నటించగా , స్నేహ , ప్రశాంత్ మొదలగు వారు ఇతర పాత్రల్లో నటించారు.