నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నిర్మించిన చిత్రం అ!. నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా హిట్ సాధించకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డ్స్ సైతం దక్కాయి.
ఈ యువ దర్శకుడు ‘కల్కి’ అంటూ రెండో సినిమాను రాజశేఖర్తో చేసి ఆకర్షించారు. ఇక మూడో సినిమా మరింత డిఫరెంట్గా ఉండాలని ప్లాన్ చేసిన ఆయన.. లేటెస్ట్ ఇష్యూ కరోనా వైరస్ నేపథ్యంలో సినిమాను ప్రకటించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్న ప్రశాంత్ వర్మ.. దానికి ‘జోంబీ రెడ్డి’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జోంబీ అనే ఓ స్మశాన వాటికను చూపిస్తూ భయపెట్టిన ఆయన ఆ స్మశానంలోని వాతావరణం, ఎరుపు రంగులో ఉన్న చంద్రుడు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో మరింత భయపెట్టారు. థ్రిల్లింగ్, హారర్ జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి వినూత్నంగా భయపెట్టబోతున్నట్లు తెలిపారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది