రాఖీ పండుగ వేళ విషాదం..

రాఖీ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుందాం అనుకున్న ఆ ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి . బైక్ ఫై వెళ్తున్న అన్నాచెల్లెలు ను బస్ రూపంలో మృతువు వెంటాడింది. ఈ ఘటన చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి స్టేజీ వద్ద చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ..వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామానికి చెందిన నందిని, దామోదర్‌ బైక్‌పై వెళ్తుండగా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి స్టేజీ వద్ద వీరిని కొల్లాపూర్‌ డిపో బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.