సందడి లేని ఐపీయల్ కు అంతా రెడీ

వేసవిలో ఎంతో ఆర్భాటంగా జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు కాస్తంత ఆలస్యంగా, రేపటి నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం పోటీలన్నీ అభిమానుల కేరింతలు, ఛీర్ లీడర్స్ సందడి, జిగేల్మనే విద్యుత్ కాంతులు తదితరాలు ఏమీ లేకుండానే సాగనున్నాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన వారికి, ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు కాస్తంత మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగించనున్నాయి.

ఇక తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య, శనివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ పోటీలను ప్రారంభిస్తూ జరిగే వేడుకల కార్యక్రమం ఈ సంవత్సరం రద్దయింది. దుబాయ్, షార్జాల్లోని స్టేడియాల్లో తొలి దశ మ్యాచ్ లన్నీ అభిమానులు లేకుండానే సాగనుండగా, తదుపరి దశలో పరిస్థితిని బట్టి, 30 శాతం మంది ఫ్యాన్స్ ను అనుమతించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.