ఆయేషా మీరా కేసు : ‘రీ-పోస్టుమార్టమ్‌’..?

‘దిశ’ ఘటన దేశ వ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు రేపిందో తెలిసిందే. నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో మెజార్టీ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో 2007 విజయవాడ శివారులో హత్యకు గురైన తెనాలికి చెందిన విద్యార్థిని ఆయేషా మీరా కేసు మరోసారి వార్తలోకి వచ్చింది. ఆమె భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్‌’ చేయించాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆమె మృతదేహానికి ‘రీ-పోస్టుమార్టమ్‌’ చేయాలని కొద్ది నెలల క్రితం భావించారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రక్రియ జరగలేదు. తాజాగా ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. డిసెంబరు 20 లోపునే ఈ ప్రక్రియ నిర్వహించనున్నారని..ఈ మేరకు సీబీఐ అధికారులు స్థానిక అధికారులను సంప్రదించారని సమాచారం.